JOBS: నిరుద్యోగులకు శుభవార్త.. ఈ జాబ్ మేళాలో రూ.2 లక్షల 80 వేల జీతంతో ఉద్యోగం పొందే అవకాశం

JOBS
JOBS

JOBS: చాలామంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటువంటి వారికి ఒక మంచి శుభవార్త. పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ లేదా పై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతి నైపుణ్యాన్ని అందించి ఏపీ ఎస్ ఎస్ డి సి ఆధ్వర్యంలో వాళ్లకు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సిద్ధంగా ఉంది.

ప్రభుత్వం పదవ తరగతి మొదలుకొని ఆ పై చదువులు చదివిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించబడిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్లకు జిల్లాల వారీగా శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉద్యోగ మేళ నిర్వహించి ఎన్నో వందల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మే నెల 8వ తేదీన మెగా జాబు మేళా నిర్వహించబోతుంది. దీని గురించి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళా మే 8వ తేదీన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ మెగా జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులకు 13 ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలను కల్పించేందుకు పాల్గొంటున్నాయి. ఈ జాబ్ మేళాకు పదవ తరగతి నుంచి బిఎస్సి, ఎంబీఏ, ఐటిఐ, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనవచ్చు. మే 8వ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభం అవుతుంది. కర్నూలు జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాల్సిందిగా ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డి తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now