UPI TRANSACTIONS: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఏది కొనుగోలు చేసిన కూడా యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది దగ్గర చిల్లర కూడా ఉండడం లేదు. ఉదాహరణకు మీరు 40 రూపాయలు కొనుగోలు చేస్తే 100 రూపాయల నోటు ఇచ్చారంటే మీకు తిరిగి 60 రూపాయలు వస్తాయి. అలాగే 50 రూపాయల నోటు ఇచ్చారంటే పది రూపాయల నోటు మీకు తిరిగి చెల్లించాలి. ప్రస్తుతం ఇది సమస్యగా మారింది. దాంతో ఈరోజుల్లో చాలామంది యూపీఐ తో చెల్లింపులు చేస్తున్నారు. యూపీఐ చెల్లింపులపై తాజాగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించే ప్రతిపాదనలేదని స్పష్టంగా తెలిపింది.
2000 రూపాయలు పైబడిన యూపీఐ లావాదేవీల పై జిఎస్టి 18% విధిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ పూర్తిగా తప్పు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నట్లు ఖండించడం జరిగింది. కొన్ని మీడియా సంస్థల్లో మరియు సామాజిక మాధ్యమాలలో కూడా దీనిపై వచ్చిన వార్తలను తోసిపుచ్చిన ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు తాము వాటిపై జీఎస్టీ విధించడం లేదు అంటూ తెలిపింది. ప్రస్తుతం పర్సెం టు మర్చంట్ యూపీఐ ద్వారా చేసే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు విధించలేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2020 జనవరి నుంచి ఎండిఆర్ని తొలగించింది. ఈ క్రమంలో ఈ లావాదేవులపై జిఎస్టి వర్తించదు. అలాగే లావాదేవీల పరిమితిని పర్సన్ టు పర్సన్ మరియు పర్సన్ టు మర్చంట్ లావాదేవీలకు యూపీఐ ద్వారా లక్ష రూపాయలు గరిష్ట పరిమితి ఉంది.
అలాగే మరికొన్ని పర్సన్ టు మర్చంట్ లావాదేవీలకు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా యూపీఐ పరిమితి ఉంది. సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎటువంటి చార్జీలు విధించదు. ఒకవేళ మీరు ప్రీపెయిడ్ వాలెట్స్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ లావాదేవీలు చేసినట్లయితే పేమెంట్ అగ్రిగేటర్లు 1.1 శాతం సర్వీస్ ఛార్జ్ ను విధిస్తుంది. ఇలాంటి చార్జీలపై 18 శాతం జీఎస్టీ ఉంటుంది.