SBI Schemes: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి రెండు స్కీములు ఈ నెల ఆఖరితో ముగుస్తున్నాయి. ఈ రెండు స్కీములలో ఫిక్స్ డిపాజిట్ చేసినవారికి ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వస్తుండడంతో ఖాతాదారులు ఈ స్కీముల పట్ల ఆసక్తి చూపుతున్నారు. SBI అమృత్ కలష్, అమృత్ వృష్టి పథకాలను ప్రజల అవసరాల నిమిత్తం ఫిక్స్ డిపాజిట్ ల కింద ఈ పథకాలలో మంచి రాబడిని బ్యాంకు వినియోగదారులకు అందిస్తుంది. పథకాలలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి మార్చి 31 వరకు గడువు ఉంది.
SBI అమృత్ కలష్: ఈ పథకాన్ని 2024 సంవత్సరంలో బ్యాంకు ప్రారంభించింది. పథకంలో ఫిక్స్ డిపాజిట్ కింద 444 రోజులు ఖాతాదారులు తమ పెట్టుబడిని ఉంచవచ్చు. సాధారణ ఖాతాదారులకు 7.25% వడ్డీ రేటు, సీనియర్ సిటిజెన్లకు 7.75% వడ్డీ రేటును బ్యాంకు వార్షికంగా అందిస్తుంది. ఈ పథకం కింద 444 రోజులు 2 లక్షల ఫిక్స్ డిపాజిట్ చేసిన సాధారణ పౌరులకు ₹ 2లక్షల 18వేల 532 రూపాయల వరకు జమవుతుంది. సీనియర్ సిటిజన్లు ₹ 2 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే వారికి ₹ 2 లక్షల 19వేల 936 ఇలా రిటర్న్స్ వస్తాయి. దేశంలోనే బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద సేవ కేంద్రంగా ఎస్బిఐ ఉండడంతో ఖాతాదారులు ఈ బ్యాంకులో నమ్మకంగా డిపాజిట్లు చేయడానికి ఆసక్తిని చూపుతారు.
SBI అమృత్ వృష్టి: ఇంతకంలో ఖాతాదారులు సుమారు 400 రోజులపాటు ఇట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంది. SBI ఈ పథకాన్ని ఏప్రిల్ 2023 సంవత్సరంలో ప్రారంభించింది. ఇందులో సాధారణ పౌరులకు 7.10 శాతంగా బ్యాంకు వడ్డీ రేటును చెల్లిస్తుంది. అలాగే సీనియర్ సిటిజనులకు 7.60 శాతంగా బ్యాంకు చెల్లింపులను అందజేస్తుంది. 400 రోజులపాటు సుమారు రెండు లక్షల రూపాయలను సాధారణ పౌరులు ఫిక్స్ డిపాజిట్ చేసిన వాటిలైతే వారికి మెచ్యూరిటీ సమయానికి ₹ 2లక్షల 15వేల 562 రూపాయల మొత్తం బ్యాంకు చెల్లిస్తుంది. సీనియర్ సిటిజెన్లు ₹ 2లక్షలు డిపాజిట్ చేసినట్లయితే వారికి ₹ 16వేల 658 రూపాయలు వడ్డీ రూపంలో బ్యాంకు మెచ్యూరిటీ సమయం తర్వాత చెల్లిస్తుంది.
SBI తన ఖాతాదారుల కోసం అందిస్తున్న అధిక మొత్తం వడ్డీ ఫిక్స్ డిపాజిట్ పథకానికి సమీపంలోని SBI బ్రాంచ్ అధికారులను గాని లేక మొబైల్ YONO App ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే వెసులుబాటును బ్యాంకు కలగజేస్తుంది.