Telangana Govt: ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో భారీ మార్పులు.. రేవంత్ సర్కార్ సంచల నిర్ణయం.. జీవో విడుదల

Telangana Govt
Telangana Govt

Telangana Govt: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగ వ్యవస్థలో పెను మార్పులను చేసింది. ఏకంగా 6వేల పైచీలుకు మంది ఉద్యోగులను తీసేస్తూ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగం తర్వాత విరమణ పొంది కాంట్రాక్టు పద్ధతులపై కొనసాగుతున్న సుమారు 6వేల పై చీలుకు ఉద్యోగస్తులను తొలగిస్తున్నట్లుగా సర్కార్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ దశలో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే కిందిస్థాయి అటెండర్ నుండి ఐఏఎస్ అధికారి వరకు సర్కార్ తొలగించిన వారిలో ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెలాఖరుకల్లా వీరిని తొలగించే ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారికి ఆదేశాలు సైతం జారీ చేసినట్లు సమాచారం. కాకపోతే మళ్లీ కొత్తగా ప్రకటనలు విడుదల చేసి నియామకాలను చేపడతామన్న కండిషన్ కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిసింది.

ఈ ప్రభావం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, ఫారెస్ట్ శాఖ తోపాటు, ఇంజనీర్లు, పలు శాఖలోని సాంకేతిక నిపుణులతో పాటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, మెట్రో వంటి ఉద్యోగస్తులపై ప్రభావం ఉండనుంది. దీనికి తోడు మరికొన్ని శాఖలోని వారిపై కూడా ఈ ప్రభావం ఉంటుందని సమాచారం.

ఈ జీవోతో మరో 6వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..

తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నిరుద్యోగులకు ఒకింత శుభవార్త అని చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పలు శాఖలోని కాంట్రాక్ట్ పద్ధతిలో పదవీ విరమణ తర్వాత కొనసాగుతున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగుల నియామకాలకు ఆశాజనకంగా ఉంది. మళ్లీ నియామకాలు చేపడతామని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నట్లు నోటిఫికేషన్లు విడుదల చేస్తే దాదాపు 6వేల పైచీలుకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. అలాగే కొంతమంది ఉద్యోగులకు పదోన్నతులు కూడా లభించే అవకాశం లేకపోలేదు. జీవో నిబంధనల ప్రకారం కాంటాక్ట్ పద్ధతిలో పదవీ విరమణ తర్వాత కొనసాగుతున్న కొంతమందిలో నైపుణ్యం ఉన్న ముఖ్య శాఖకు చెందిన వారిని తిరిగి నియమించుకునే అవకాశం కూడా ఉన్నట్లు కనబడుతుంది. ఇదివరకే చాలా ఉద్యోగ సంఘాలు సీనియారిటీ ఉన్న శాఖలో పదోన్నతులు లభించడం లేదని వినతిని సైతం సీఎం దృష్టికి తీసుకు వెళ్ళారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నిరుద్యోగులతో పాటు పదోన్నతులు లభించే ఉద్యోగస్తుల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు శుభవార్తగా, పదోన్నతులు పొందే వారికి మంచి అవకాశంగా ఉన్న రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now