PDF RICE: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

PDF RICE
PDF RICE

PDF RICE: నిజామాబాద్, మార్చి 18 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొజ్జా కాలనీలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి ఏసీపి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మంగళవారం పట్టుకున్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో దాడి చేయగా అక్రమంగా తరలిస్తున్న 75 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం లోడుతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కొంగ తరలిస్తున్న బియ్యం విలువ సుమారు 2 లక్షల 45 వేల రూపాయలు ఉంటుందని, వీటిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now