Gold Rate Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన పసిడి..
గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలకు సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నడూ లేని ఆల్ టైం రికార్డ్స్ కి పసిడి ధరలు చేరుకున్నాయి. ఈ ధరలు సంపన్నుల గుండెలు సైతం గుబేలు మనేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా శుభకార్యాలు, వివాహాలు జరుగుతున్నాయి. వివాహాలలో బంగారం చాలా ముఖ్యమైనది. కానీ అటువంటి బంగారాన్ని ఇప్పుడు సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు బంగారం ధరలు భారీగా పెరుగుతూ అందరికీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం లక్ష రూపాయలకు చేరువలో పసిడి ధరలు ఉన్నాయి. శుక్రవారం రోజు సాయంత్రం 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.96,540 కు చేరుకుంది. దీంతో కేవలం పసిడి ధర రెండు రోజుల్లోనే 6 వేల రూపాయలు పెరిగింది. లేటెస్ట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త టారిఫ్ ప్రకటించిన క్రమంలో బంగారం ఒక సురక్షిత పెట్టుబడి సాధారణంగా తెలుస్తుంది. కిందటిసారి పసిడి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆల్ టైం హై కి చేరుకున్న సంగతి తెలిసిందే.
ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ టైం గరిష్ట స్థాయికి పసిడి ధరలు చేరుకున్నాయి. గత కొన్ని ఏళ్ల నుంచి పెరుగుతున్న పసిడి మరియు వెండి ధరలు తాజాగా ట్రంప్ వాణిజ్య యుద్ధంతో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అమెరికా మరియు చైనా మధ్య ట్రేడ్ వార్ పిక్ స్టేజ్ కి చేరుకుంది. ఈ క్రమంలో పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ రిస్క్ లేని పసిడి వైపు ముగ్గు చూపడంతో ధరలు ఈ రేంజ్ లో పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో ఈరోజు 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.95,400 గా ఉంటే, 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,450 గా నమోదయింది. ఇది ఇలా ఉంటే సిల్వర్ కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. ఈ మధ్యకాలంలో వరుసగా తగ్గుతూ స్థిరంగా సాగిన వెండి రెండు రోజులుగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. నిన్న కిలో వెండి ధరపై రూ.4 వేలు పెరిగింది. అలాగే ఈరోజు కిలో వెండి పై రూ.100 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.97,100 గా ఉన్నట్లే సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రాలలో కిలో వెండి ఒక లక్ష ఎనిమిది వెలు గా ఉంది. ప్రాంతాలను బట్టి పసిడి మరియు వెండి ధరలలో వ్యత్యాసం ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.