Metpalli: మెట్ పల్లి, మార్చి 18 (ప్రజా శంఖారావం): దైవ దర్శనానికి వచ్చిన మహిళ మెడలోంచి గుర్తు తెలియని వ్యక్తి మంగళ సూత్రాన్ని అపహరించారు. మంగళవారం నిర్మల్ జిల్లా మునిపల్లి మండలం లక్ష్మణ చంద గ్రామానికి చెందిన దొండ రమ్య కుటుంబ సభ్యులతో కలిసి మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోని ఎల్లమ్మ ఆలయానికి దైవ దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం వంట చేసుకొని తింటున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి బైక్ పై వచ్చి వెనుక నుంచి 2 తులాల మంగళసూత్రాన్ని అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా మెట్ పల్లి ఎస్సై కిరణ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now