Metpally: మెట్ పల్లి/ఇబ్రహీం పట్నం, మే5 (ప్రజా శంఖారావం):వేసవి దృశ్య ప్రజలకు మంచినీటి సమస్య రాకుండా చూడాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఇబ్రహీం పట్నం మండలం డబ్బా గ్రామంలోని మిషన్ భగీరథ పంపును సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మేల్యే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వేసవి దృష్ట్యా తాగునీటికి ఏలాంటి ఇబ్బందులు రానివద్దని అందుకు తగిన చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు.ప్రజలకు మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను కోరారు.
ఎక్కడైనా లీకేజీ సమస్య ఉన్నచో వెంటనే సరి చేయాలన్నారు.100% పైప్ లైన్ జరగాలని,నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచి నీటిని అందించాలని తెలిపారు.ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు.ఎలాంటి సమస్య ఉన్న వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మిషన్ భగీరథలో పనిచేస్తున్న పంప్ ఆపరేటర్స్ కి గత మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఏజిఎం సందీప్ తో మాట్లాడి వెంటనే జీతాలు అందించాలని కోరారు.ఈ సమావేశంలో మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత విభాగాల ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.