Telangana: ఫ్లాష్.. ఫ్లాష్.. 5వేల సర్వేయర్ల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్.. పూర్తి వివరాలు

Telangana
Telangana

Telangana: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే విభాగాన్ని మరింత బలంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈనెల 17వ తేదీ లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో త్వరలో 5000 మంది లైసెన్స్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి సచివాలయంలో సర్వే, సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ పై సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్తో పాటు సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, సి సి ఎల్ ఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం మకరందు ఇంకా తదితరులు పాల్గొన్నారు. భూములకు సంబంధించిన పంచాయతీలకు శాశ్వత పరిష్కారం అందించడం కోసమే సర్వే, సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ను మరింత బలంగా చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంలో భూమి రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే పటాన్ని కూడా జత చేయడం ఇకపై తప్పనిసరి చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో భవిష్యత్తులో సర్వే విభాగం పాత్ర మరింత కీలకము కానుంది.

ఈ క్రమంలో రాబోయే రోజులలో ప్రభుత్వాల లక్ష్యము నెరవేరాలంటే ఇప్పటివరకు ఉన్న 402 మంది సర్వేయర్లు సరిపోరని ఆయన తెలిపారు. ఈ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకొని రావడంతో పాటు సర్వే విభాగంలో ఖాళీ ఉన్న సర్వేయర్ పోస్టులను భర్తీ చేస్తుంది. అలాగే భూముల సర్వేకు అవసరమైన అత్యాధునిక పరికరాలను కూడా అందుబాటులోనికి తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ గణితం ఒక పాఠ్యాంశంగా ఉండాలని కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు అని తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now