Cylinder Price Hike: తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచినా కొన్ని నిమిషాలకే ఎల్పిజి సిలిండర్ ధరలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే ఉజ్వల స్కీం కింద అందిస్తున్న గ్యాస్ సిలిండర్లపై కూడా ఈ ధరల పెంపు వర్తిస్తుంది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ ధరలు పెంచిన కొన్ని నిమిషాలకే కేంద్ర ప్రభుత్వం మరో షాకింగ్ న్యూస్ కూడా ప్రకటించింది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్లతో పాటు ఉజ్వల స్కీం కింద అందిస్తున్న గ్యాస్ సిలిండర్ పై కూడా రూ. 50 పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించడం జరిగింది.
ఈ క్రమంలో ఉజ్వల స్కీం కింద రూ. 500 కి లభిస్తున్న గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం రూ.550 కు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు రూ. 855 ఉండగా ప్రస్తుతం రూ. 910 కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలను బట్టి గ్యాస్ సిలిండర్ ధరలు రూ. 827 నుంచి రూ. 869 వరకు ఉన్నాయి. ప్రస్తుతం పెంచిన ధరలతో గరిష్టంగా గ్యాస్ సిలిండర్ ధర రూ. 929 కు చేరుకుంది. ఒక్క రోజులోనే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నిత్యవసరాల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ధారాలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే హోటల్లో మరియు రెస్టారెంట్ల సహా వాణిజ అవసరాల కోసం వినియోగించే వాణిజ్య సిలిండర్ జాషు ధరను గత వారము రూ. 41 తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే గతవారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించే వారం తిరగకముందే వంటగ్యాసే సిలిండర్లపై 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.