SRSP PROJECT: డేంజర్ జోన్ లోకి ఎస్సారెస్పీ ప్రాజెక్ట్.. 10 టీఎంసీల నీటి నిల్వ..
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం ఇంతకింతకు డేంజర్ జోన్ లోకి వెళ్ళనుంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా నీటి ప్రణాళిక ప్రకారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు గత సంవత్సరం డిసెంబర్ 25 నుండి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 9 వరకు సాగవుతున్న ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు రైతులకు నిరందించే దిశగా జోన్-1, జోన్ -2 విధానం ద్వారా నీటిని వదులుతున్నారు. ఇప్పటివరకు 59 టీఎంసీల నీటిని యాసంగి పంట సాగుకు వదిలారు. కాగా మరో 4 టీఎంసీల నీటిని అధికారులు ఈనెల 9న వదలనున్నారు. ఈ లెక్కన జోన్-1, జోన్ -2 విధానం ప్రకారం ఏడు రోజుల చొప్పున వదిలిన 63 టీఎంసీల నీటి విడుదల పూర్తవుతుంది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న మొత్తం పీఎంసీల నీటి నిలువ 10 టీఎంసీలకు పడిపోతుందని డ్యాం అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ లెక్కన డ్యామ్ లోని స్టోరేజీ డేంజర్ జోన్ లోకి వెళ్లనున్నట్లు స్పష్టమవుతుంది.
ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో లేదు..
ఎగో ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి వచ్చే ఇన్ఫ్లౌ లేకపోవడంతో స్టోరేజీ దారుణంగా తగ్గిపోయింది. ఎగువ ప్రాంతం మహారాష్ట్ర నుండి ఎలాంటి ఇంఫ్లో ప్రస్తుతానికి లేదని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒప్పందం ప్రకారం బాబ్లీ గేట్లను మార్చి 1న వదిలి అధికారులు నీటిని విడుదల చేశారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ద్వారా వదిన నీది తో ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న యాసంగి పంటకు అధికారులు ఆయకట్టు ప్రాంతంలోని రైతులకు నీటిని అందించారు. జోన్ -1, జోన్ -2 విధానం ప్రకారం యాసంగి పంటకు విడుదల చేసిన నీటి విడుదల అనంతరం ప్రాజెక్టులో ఎగువ ప్రాంతం నుండి inflow లేకపోవడంతో స్టోరేజీ తగ్గింది.
నీరు పొదుపు చేయకుంటే ప్రమాదమే..
జోన్-1, జోన్ -2 విధానం ప్రకారం విడుదల చేసిన యాసంగి పంట సాగుకు నీటి విడుదల అనంతరం ప్రాజెక్టు నుంచి సాగునీరు ఇవ్వడానికి సాధ్యపడదని ఎస్సారెస్పీ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈనెల 9 న విడుదల చేసే 4 టీఎంసీల నీటితో నీటి విడుదల నిలిచిపోతుందని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు విడుదల చేసిన నీటినే రైతులు పొదుపుగా వాడి యాసంగి పంట సాగుకు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. నీటిని పొదుపు చేయకుంటే ప్రమాదం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటితో నిజామాబాద్, అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు, జగిత్యాల్ వరకు తాగునీటికి వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.