STUDENTS JOBS: బీటెక్ చేసిన వాళ్ల కోసం ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఒక గుడ్ న్యూస్. యువతకు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 7. అయితే ఈ తాజా నియమాకం ద్వారా మొత్తం 52 పోస్టులను అధికారులు భర్తీ చేయనున్నారు. వీటి ద్వారానే నవరత్న ప్రభుత్వ రంగ సంస్థలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు కూడా నియమాకాలు జరుగుతాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నావాళ్లు ఇచ్చిన అంశాలను జాగ్రత్తగా చదివి దరఖాస్తులు చేసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మేనేజ్మెంట్ ట్రైని బిఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలు ఉండాలి. వాళ్లు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఎంపిక అయితే వాళ్లకు నెలకు రు.60,000 నుండి రూ.1,80,000 జీతం లభిస్తుంది. అలాగే ఈ పోస్టులకు అభ్యర్థులు గేట్ 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్కు పిలుస్తారు.