Gurukula School: మెట్ పల్లి మండలంలో ని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన రాపర్తి హర్ష ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న హర్ష గురువారం ఉదయం చేయి నొప్పిగా ఉందని చెప్పడంతో ప్రిన్సిపాల్ మాధవి లత కోరుట్ల ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఏదో చీమలు కరిస్తే వచ్చిన స్క్రాచెస్ లాగా ఉన్నాయని అడ్మిట్ చేసుకొని చికిత్స అందించారని,విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉండడం వలన ఇంటికి పంపించినట్లు డిఎంహెచ్ఓ ప్రమోద్ తెలిపారు.ఐలాపూర్ వైద్యాధికారికి పెద్దాపూర్ గురుకులంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు డాక్టర్ సమీనా పెద్దాపూర్ గురుకులంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.గురుకులంలో వైద్యాధికారి 56 మందిని స్కిన్ ఎలర్జీలు మరియు కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులకు చికిత్స అందించారు.