Task Force Police: ఆర్మూర్ టౌన్, మార్చి 31 (ప్రజా శంఖారావం): అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వడ్డీ వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న బిఆర్ఎస్ నాయకుడి ఇంటిపై సోమవారం జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య నేతృత్వంలో దాడులు నిర్వహించారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద లభించిన 34 ద్విచక్ర వాహనాలను ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ కు అప్పగించినట్లు సమాచారం. ఒక్క సారిగా టాస్క్ ఫోర్స్ అధికారులు వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లపై దాడులు నిర్వహించడంతో పట్టణ కేంద్రంలోని వడ్డీ వ్యాపారస్తుల్లో భయాందోళన మొదలైంది.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now