GURUKULA SCHOOL: గురుకుల పాఠశాలలో ఏం జరిగింది..? 30 మంది విద్యార్థులకు ఎందుకిలా..!

GURUKULA SCHOOL
GURUKULA SCHOOL

GURUKULA SCHOOL: జగిత్యాల జిల్లా, ఏప్రిల్ 15 (ప్రజా శంఖారావం): ఆ పాఠశాలలో ఏం జరుగుతోంది. ఎందుకిలా పిల్లలు ప్రతిసారి ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 30 మంది విద్యార్థులు జ్వరంలతో బాధపడుతున్నట్లు సమాచారం.

ఇదివరకే 10 మంది పిల్లలను చికిత్స నిమిత్తం ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 5గురు విద్యార్థులు తీవ్ర జ్వరంతో పడుతుండగా వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు 30 మంది విద్యార్థులు జ్వరాలతో గురుకుల పాఠశాలలో అనారోగ్యానికి గురికావడంపై పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యార్థులకు జ్వరం సోకి బాధపడుతున్నారా.?

లేక గురుకుల పాఠశాలలోని పరిసర ప్రాంతాల కారణంగా విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారా.! అన్నది తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. ఒకేసారి ప్రైమరీ తరగతులకు చెందిన 6, 7, 8 తరగతుల విద్యార్థులు జ్వరాలతో బాధపడడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా డిఎం హెచ్ ఓ ప్రమోద్ పరామర్శించి వారికి అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now