10th Results 2025: 10 జవాబు పత్రాల మూల్యంకనం.. ఫలితాలు ఎప్పుడంటే..?

10th Class Results
10th Class Results

10th Results 2025: 10 జవాబు పత్రాల మూల్యంకనం.. ఫలితాలు ఎప్పుడంటే..?

ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పదో తరగతి పరీక్ష ఫలితాలను ప్రభుత్వం త్వరగా విడుదల చేసే క్రమంలో 10 జవాబు పత్రాల మూల్యంకణాన్ని త్వరగా నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జవాబు పత్రల మూల్యాంకనం కోసం విద్యాశాఖ డైరెక్టర్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలో ప్రశ్న పత్రం లీకేజీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10 ప్రశ్న గణిత శాస్త్రం పేపర్ లీకేజీ పై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ ఘటనలు మినహా మిగతా అన్ని ఎగ్జామ్ సెంటర్లలో పదవ తరగతి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు హాజరవుతున్నారు. చివరగా సాంఘిక శాస్త్రం పరీక్షకు విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2 తారీఖున ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ముందుగా ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో వరుసగా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో మార్చి నెలలో మగియాల్సిన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 వరకు వాయిదా పడ్డాయి.

రిజల్ట్స్ ఎప్పుడంటే..?

ఇక ఏప్రిల్ 2వ తేదీతో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తవడంతో విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంపై ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి విద్యార్థుల రిజల్ట్స్ ను త్వరగా ప్రకటించే విధంగా చూడాలని విద్యాశాఖ అధికారులకు సర్కార్ ఆదేశించింది. విద్యాశాఖ డైరెక్టర్ కూడా జవాబు పత్రాల మూల్యంక కేంద్రాలను ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా పదవ తరగతి రిజల్ట్స్ ప్రకటించాలని నిర్ణయించారు.

జవాబు పత్రాల మూల్యంకనం జరిగే కేంద్రాల్లోకి సెల్ఫోన్లను నిషేధించి, జవాబు పత్రాల మూల్యంకన సమయంలో క్షుణ్ణంగా పరిశీలించి మార్కులను వేయాలని విద్యాశాఖ డైరెక్టర్ సూచించారు. మార్కులు పున:పరిశీలన విషయంలో తేడాలు వస్తే సంబంధిత అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఏప్రిల్ మాసం చివరి నాటికి పదవ తరగతి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now