POST OFFICE: సామాన్య ప్రజలకు ప్రతినెల మంచి ఆదాయం కల్పించడం కోసం పోస్ట్ ఆఫీస్ ఇప్పటివరకు అనేక రకాల పథకాలను అమలు చేసింది. తాజాగా ప్రతినెలా కొంత ఆదాయం చేతికి రావాలని కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ లో ఉండే ఈ పథకం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. చిన్న పెట్టుబడిదారులను ఆదుకోవడానికి అలాగే వాళ్లకు ప్రతినెలా స్థిరమైన ఆదాయాన్ని కల్పించడానికి పోస్ట్ ఆఫీస్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. 2025లో పోస్ట్ ఆఫీస్ అప్డేటెడ్ మంత్లీ ఇన్కమ్ స్కీము పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద ఆ పెట్టుబడి పెట్టిన వాళ్లకు రిటర్న్స్ అందిస్తుంది.
ఈ పథకంలో చాలా తక్కువ రిస్క్ ఉంటుంది అని చెప్పొచ్చు. రిస్కు తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళకి అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ప్రతినెలా కొంత ఆదాయం చేతికి అందేలాగా కోరుకునే వారికి ఇది చాలా అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ పథకం భారత ప్రభుత్వం తీసుకువచ్చిన సేవింగ్స్ పథకం. స్టాక్ మార్కెట్ తో సంబంధం లేకుండా ఈ పథకంలో ఐదు సంవత్సరాల పాటు ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ పొందవచ్చు. ఈ పథకంలో గ్యారెంటీ రిటర్న్స్ పొందవచ్చు. అలాగే ఐదు సంవత్సరాల పిరియడ్లో వడ్డీ రేటు కూడా అలాగే ఉంటుంది.
కేవలం వెయ్యి రూపాయల పెట్టుబడితో కూడా ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. అలాగే జాయింట్ అకౌంట్ లో గరిష్టంగా 15 లక్షల వరకు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులతో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒక ఏడాదికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ పథకం 7.7% వడ్డీని అందిస్తుంది. మీకు నెలవారి వచ్చే ఆదాయం మీరు పెట్టుబడి పెట్టే అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు 1,50,000 పెట్టుబడి పెడితే మీకు ప్రతి నెల రు.962.50 వస్తుంది. అలాగే ఒకవేళ మూడు లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు ప్రతినెల రు.1925 వస్తుంది.