HIGH COURT: తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కర్ణాటక హైకోర్టు రాపిడో తో సహా బైక్ టాక్సీ అగ్రిగేటర్లను ఆరువారాలలోగా తమ కార్యకలాపాలను మూసివేయాలని ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో బుధవారం రోజున జస్టిస్ బి శ్యాంప్రసాద్ ఇచ్చిన తీర్పు రంగంలో పనిచేస్తున్న కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బగా మారిందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు 1988 నాటి మోటార్ వాహనాల చట్టం కింద బైకు టాక్సీ సేవలను తీసుకురావడానికి మూడు నెలల గడువు ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు రైడ్ హీలింగ్ సర్వీస్ ఆపరేటర్లు మోటార్ వెహికల్స్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తెలిపింది. అలాగే కొంతమంది బైకు టాక్సీ డ్రైవర్లు మహిళల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు కూడా వస్తున్నాయని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 16 వాహనాల చట్టం ప్రకారం 1988లోని సెక్షన్ 93 ప్రకారం కొత్త నిబంధనలను రూపొందించే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే వాణిజ్యపరంగా తెలుపు నెంబర్ ప్లేట్లతో ఉన్న ద్విచక్ర వాహనాలను వినియోగించేందుకు అనుమతి ఇవ్వము అని హైకోర్టు స్పష్టం చేసింది.