Govt Scheme: మహిళలకు అద్భుతమైన పథకం.. ఏడాదికి రూ.10 వేలు ఉచితంగా.. ఆ రాష్ట్ర మహిళలకు మాత్రమే

Govt Scheme
Govt Scheme

Govt Scheme: ప్రభుత్వం మనదేశంలో మహిళల కోసం ఇప్పటివరకు ఎన్నో రకాల పథకాలు అమలు చేసింది. అయితే మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం రకరకాల పథకాలు అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఈ ప్రభుత్వం మహిళల కోసం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొని వచ్చింది. మహిళలకు సంవత్సరానికి 10 వేలు రూపాయలు చొప్పున అందిస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో మహిళల కోసం అనేక అద్భుత పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. మహిళలకు ఈ పథకాల ద్వారా ప్రభుత్వం సామాజికంగా మరియు ఆర్థికంగా సాధికారత కల్పించాలని ముందుకు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే గత ఏడాది ఒడిశా ప్రభుత్వం మహిళల కోసం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది.

సుభద్ర యోజన పథకం కింద ఒడిశా ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు రు.10 వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో విడతకు మహిళలకు 5000 రూపాయలు చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఒడిస్సా రాష్ట్రంలో సుభద్ర యోజన పథకం చాలా ప్రజాధారణ పొందిన పథకం. అయితే ప్రభుత్వం ఏ మహిళలకు సుభద్ర యోజన పథకం ప్రయోజనాన్ని అందిస్తుందో తెలుసుకుందాం. ఈ పథకానికి వయసు 21 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఒకవేళ మీ వయస్సు 21 కంటే తక్కువ మరియు 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నా కూడా మీరు ఈ ప్రయోజనానికి అర్హులు కాదు. అయితే సుభద్ర యోజన పథకం ఒడిశా రాష్ట్రంలో ప్రారంభించారు కాబట్టి ఒడిస్సా రాష్ట్ర మహిళలు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. వేరే రాష్ట్రాల మహిళలు ఈ పథకాన్ని పొందలేరు. ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే మహిళలు జాతీయ ఆహార భద్రత చట్టం లేదా రాష్ట్ర ఆహార భద్రత పథకం కింద రేషన్ కార్డులో తమ పేరును నమోదు చేసుకోవాలి. ఈ ప్రయోజనం పొందాలంటే కుటుంబ ఆదాయం రెండున్నర లక్షల కంటే తక్కువ ఉన్న మహిళలకు మాత్రమే వర్తిస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now