ACB RIDES: రాజన్న సిరిసిల్ల జిల్లా, మే 10 (ప్రజా శంఖారావం): అవినీతి నిరోధక శాఖ దాడుల్లో మరో తిమింగలం చిక్కింది. రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా అనిశా వలలో సిరిసిల్ల ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిక్కాడు. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్రం రెడ్డి అమరేందర్ రెడ్డిని కరీంనగర్లోని తన నివాసంలో లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ మండలం అవునూరు, అగ్రారాం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మాణం కోసం కాంట్రాక్ట్ పనికి సంబంధించిన రూ.50 లక్షల బిల్లుల మంజూరు విషయంలో రూ.60 వేలు సదరు కాంట్రాక్టర్ వద్ద డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ వద్ద ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ అమరేందర్ రెడ్డిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.