Current shock: మెట్ పల్లి/మల్లాపూర్, మే10 (ప్రజా శంఖారావం): గ్రామంలోని విద్యుత్ స్తంభంపై మరమ్మత్తులు చేస్తున్న సమయంలో విద్యుత్తు షాక్ కు గురై యువకుడు మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండలం గొర్రెపల్లి లో చోటు చేసుకుంది. స్థానిక పోలీసు స్టేషన్ ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం నాగరాజు (32) అనే యువకుడు గొర్రెపల్లి గ్రామంలో ప్రైవేట్ విద్యుత్ హెల్పర్ గా పనిచేస్తున్నాడు.
శనివారం ఉదయం కరెంట్ స్థంభం పై విద్యుత్ తీగలు తెగిపోవడంతో మరమ్మతులు చేస్తున్న సమయంలో పైన ఉన్న 11కేవీ విద్యుత్ తీగలు ఉన్న విషయం గమనించక ప్రమాద వశాత్తూ ఆ విద్యుత్తు తీగలు తగిలి కరెంట్ స్థంభం పైనే మృతిచెందాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now