BC GURUKULA: చేవెళ్ల/ మొహీనాబాద్, మార్చి 25 (ప్రజా శంఖారావం): మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా బీసీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న 6,7,8,9వ తరగతుల సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంజేపీ గురుకుల పాఠశాల, ఎఫ్.ఏ.సీ ప్రిన్సిపాల్ జంగం నరేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. www.mjpbcwreis.telangana.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. 6,7,8,9వ తరగతుల, ఇంగ్లీష్ మీడియంలో మొత్తం 6,832 బ్యాగ్ లాక్ ఉన్నాయని అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెలలో 20-04-2025 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటిపి లింగ స్వామి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
BC GURUKULA: బీసీ గురుకులలో బ్యాగ్ లాగ్ సీట్లకు ధరఖాస్తు
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now