Women: మహిళలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. పది పాసైన 40ఏళ్ల లోపు మహిళలకు

Women
Women

Women: మహిళల కోసం ప్రభుత్వం ఒక శుభవార్తను తెలిపింది. పండగకు ముందే మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వం మహిళలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. శిక్షణ పొందిన తర్వాత లక్షలు విలువైన ప్రయోజనం కూడా కల్పించనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను వ్యవసాయ రంగంలో ఎంత్రీకరణలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు డ్రోన్లను ఎలా వాడాలి, పంట పొలాలకు డ్రోన్ల ద్వారా ఎలా పిచ్కారి చేయాలి అనే అంశాలలో శిక్షణ ఇస్తుంది.

అయితే గ్రామీణ అభివృద్ధి శాఖ సారథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్న మహిళలకు ప్రభుత్వం ఈ శిక్షణ కల్పిస్తుంది. అందోలులోని మహిళా సమాఖ్య సమావేశ కార్యాలయంలో మహిళలకు ఈ శిక్షణ కల్పిస్తుంది. వివిధ సంస్థల సహకారంతో దాదాపు పది రోజుల వరకు మహిళలకు ఈ శిక్షణ ఉంటుంది. ఇప్పటివరకు దాదాపు 50 మందికి పైగా మహిళలను ఎంపిక చేశారు. ప్రస్తుతం వీరికి శిక్షణ జరుగుతుంది. పది రోజుల శిక్షణ పూర్తయిన తర్వాత మరోసారి వీరికి ట్రైనింగ్ ఇస్తారు. పది రోజుల శిక్షణ అనంతరం వీరికి శిక్షణ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉంటుంది.

ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ప్రభుత్వం మహిళలకు డ్రోన్లను పంపిణీ చేస్తుంది. అయితే ఈ డ్రోన్ల రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. 15 లీటర్ల కెపాసిటీ ఉన్న డోన్ల ధర దాదాపు రూ.12 లక్షలు ఉండొచ్చు అని సమాచారం. సబ్సిడీ కింద వీటిని ప్రభుత్వం మహిళలకు అందిస్తుంది. 80% వరకు సబ్సిడీ కూడా లభిస్తుంది. మిగిలిన మొత్తాన్ని మహిళలు చెల్లించుకోవాలి. ఈ క్రమంలో మహిళలు డబ్బులు సంపాదించుకోవచ్చు. అదే ఆదాయం కూడా వీళ్లు పొందొచ్చు. ఈ శిక్షణకు పది పాస్ అయినా మహిళలు అర్హులు. అలాగే 40 ఏళ్లలోపు వయసు ఉండాలి. దాదాపు 115 మంది మహిళలకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. విడతల వారీగా వీళ్ళందరికీ శిక్షణ ఇస్తారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now