Nandipet: నందిపేట్, మే 06 (ప్రజా శంఖారావం): నందిపేట్ మండల కేంద్రంలోని కుద్వాన్పూర్ గ్రామంలో సీఎం క్రికెట్ కప్ సీజన్-2 ను మంగళవారం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలలో క్రీడాకారులు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో సీఎం క్రికెట్ కప్ సీజన్-2 ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఉపాధ్యక్షులు జీవన్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ గ్రామ మండల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now