ACB RIDES: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: ములుగు జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తున్న జి సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సౌమ్యలను మంగళవారం ఏసీబీ అధికారులు 25వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి తన వైద్య సెలవుల బిల్లుల మంజూరి విషయంలో జిల్లా ఖజానా కార్యాలయానికి బిల్లులు చేసి పంపించే విషయంలో అతని వద్ద లంచం డిమాండ్ చేయడంతో సదరు ఉద్యోగి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు జడ్పీ కార్యాలయంలో సదరు బాధిత ఉద్యోగి నుండి వారు లంచం తీసుకుంటుండగా సూపర్డెంట్ జూనియర్ అసిస్టెంట్లను ఏసిబి అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు ఏసిబి అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now