Congress | ఆర్మూర్ టౌన్, మార్చి 19 (ప్రజా శంఖారావం): కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టసభలో ఆమోదం తెలపడంతో ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ఆర్మూర్ మార్కెట్ చైర్మన్ సాయిబాబా గౌడ్ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ అసెంబ్లీ సమావేశంలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపడం పై సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా ఇందుకు కృషిచేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న చారిత్రాత్మకమే అని తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ పిసిసి సెక్రటరీ ఖందేశ్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్, సీనియర్ నాయకులు జిమ్మీ రవి, అజ్జు భాయ్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విజయ అగర్వాల్, అల్జాపూర్ కిరణ్ కుమార్, శీను తదితరులు పాల్గొన్నారు.