DMHO NIZAMABAD : ఆర్మూర్ టౌన్, మార్చి 18 (ప్రజా శంఖారావం): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న బస్తీ దవఖానాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానాలోని రిజిస్టర్, రికార్డులను ఆమె పరిశీలించారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆమె అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్యం అందించాలని, ఆరోగ్య జాగ్రత్తల పట్ల సూచనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవఖాన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now