Wheatgrass: శరీరానికి గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వలన పుష్కలమైన పోషకాలు అందుతాయని చాలామందికి తెలియదు. ఈ రసం జీర్ణ క్రియ శక్తిని పెరిగేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే రక్షణ కవచంగా మీ శరీరం పనిచేస్తుంది. ఇటువంటి గోధుమ గడ్డితో వ్యాపారం చేస్తూ ఒక హైదరాబాది నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. కరోనా సమయంలో పరిశ్రమ రంగం లో ఎంతోమంది కార్మికులు రోడ్డున పడ్డారు.
కరోనా ఎంతో మంది జీవితాలను కబలించింది అని చెప్పొచ్చు. ఆ సమయంలోనే చాలామంది వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతూ సెలబ్రిటీలుగా కూడా మారారు. మరి కొంతమంది జనాలకు ఎంతో అవసరమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించారు. సామాజిక మాధ్యమాల ఉపయోగం కూడా కరోనా సమయంలో బాగా పెరిగింది.
అప్పట్లో కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటిపై వీడియోల రూపంలో సమాచారాన్ని చాలామంది ప్రజలకు తెలియజేశారు. ఆ సమయంలో ఒక హైదరాబాది కూడా వినూత్నంగా ఆలోచించాడు. కరోనా కారణంగా అతని ప్లే స్కూల్ మూతబడింది. ఈ క్రమంలో అతను ఎలా ఉపాధి పొందాలి అని ఆలోచించడంతోపాటు పదిమందికి ఉపయోగపడేలాగా కూడా ఉండాలి అంటూ ఒక వినూత్న ఆలోచన చేశాడు.
రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఏవి.. దానికోసం మనం ఏం చేయాలి అనే ఆలోచన అతనికి తట్టింది. ఈ క్రమంలో అతను యూట్యూబ్లో సర్చ్ చేస్తున్న సమయంలో గోధుమ గడ్డి ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంపొందిస్తుంది అని తెలుసుకున్నాడు. దాంతో ఇతను గోధుమ గడ్డిని పెంచడం ప్రారంభించి లక్షలు సంపాదిస్తున్నాడు. అతని పేరు మొగోల్ల జనార్దన్ గౌడ్.
కరోనా సమయంలో తన స్కూలు మూతపడడంతో ఆర్థిక కష్టాలు నుంచి బయటపడడానికి అతను ఇంట్లోనే ఉండి మార్కెట్లో బాగా డిమాండ్ ఉండే పదార్థాలు ఏంటో తెలుసుకున్నాడు. ఇంటర్నెట్లో అతను ఇండోర్ ఫార్మింగ్ లో గోధుమ గడ్డిని సులభంగా పెంచవచ్చు అనే విషయాన్ని తెలుసుకుని ఈ వ్యాపారం మొదలుపెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు.