PCC MEETING: ఉమ్మడి జిల్లా సమస్యలపై సమావేశం

PCC MEETING
PCC MEETING

PCC MEETING: నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 13 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సమస్యలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, పిఎసి కన్వీనర్ షబ్బీర్ అలీలతో ఆదివారం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.

ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సమస్యలపై ఈ సందర్భంగా వారు చర్చించినట్లు సమాచారం. సోమవారం జిల్లా పర్యటనకు రానున్న ఇన్చార్జి మంత్రి స్థానిక సమస్యలపై ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వినయ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లాలో సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో ఉన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now