Nizamabad: ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దగ్ధం

Nizamabad
Nizamabad

Nizamabad: ఆర్మూర్, మార్చి 16 (ప్రజా శంఖారావం): దళితుల పట్ల, దళిత నాయకుల పట్ల బీఆర్ఎస్ వైఖరిని ఖండిస్తూ, ఆ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఏకవచనంతో మాట్లాడిన తీరును నిరసిస్తూ ఆదివారం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దగ్ధం ఇచ్చినట్లు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్, సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాసులు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత ముఖ్యమంత్రి చేస్తామని గతంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని, మళ్లీ ఇప్పుడు దళితులను అవమానపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ స్పీకర్ పై అమర్యాదగా ప్రవర్తించిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగ గౌడ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కొంతం మంజుల మురళి, డిసిసిబి డైరెక్టర్ వాసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జిమ్మి రవి, భూమాన్న, ఫాయుమ్ బాయి, కొక్కెర భూమన్నా, బబ్లు, నారాయణ, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now