Medak |
Farmers: చేగుంట, మార్చి 17 (ప్రజా శంఖారావం): సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. 8 గ్రామాలకు సాగునీటి అవసరాల కోసం చిన్న కాలువ తీస్తే నీటి సమస్య తీరుతుందని పలుమార్లు ఎంపీ, ఎమ్మెల్యేలకు స్థానిక అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండు రోజులుగా ధర్నా చేస్తూ రోడ్డుపై రైతులు బైఠాయించిన మంత్రి స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్రి కొండ సురేఖతోపాటు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చేరుకు శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు. రామయంపేట్ నుండి 100 మీటర్ల వరకు ఒక చిన్న కాలువ తీసినట్లైతే రైతులకు సాగునీటి సమస్యలు తప్పుతాయని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఇన్చార్జ్ రైతులతో మాట్లాడి మంత్రితో ఈ సమస్యపై మాట్లాడతానని హామీ ఇచ్చి వారి ఆందోళనను విరమింపజేశారు. రైతులు రహదారిపై ధర్నా చేయడంతో కాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.