Minister Tummala: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం హైదరాబాదులో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పంట నష్టంపై పూర్తి వివరాలను సేకరించి, నివేదికను అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్రంలో వరి, మామిడి పంట సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జరిగిన పంట నష్టం పై అధికారులు నివేదిక అందజేయగానే ముఖ్యమంత్రితో చర్చించి పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now