
8th Pay Commission Update: ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం జనవరి 2026 నాటికి కాకుండా 2027 నాటికి అమలు చేయవచ్చు అని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం జనవరి 2026 నుండి జీతాలలో మరియు పెన్షన్లలో పెంపుదల ఉంటుందని భావించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తతో వారి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతం మరియు పెన్షన్ పెరుగుదల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు.
తాజాగా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లోని నివేదిక ప్రకారం 8వ వేతన సంఘం సిఫార్సులను జనవరి 2026 నాటికి కాకుండా 2027 నుండి అమలు చేయవచ్చు అని తెలుస్తుంది. వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు అని సమాచారం. అధికారికంగా వేతన సంఘం పదవీకాలం జనవరి 2026 నుండి ప్రారంభం అవుతుందని తెలిపారు. దానికింద సవరించిన జీతం మరియు పెన్షన్ లో మార్పులే 2027 సంవత్సరం వరకు అమలు చేయబడవు అని తెలుస్తుంది.
కొత్త పే స్కేల్ అమలు చేయబడిన ప్రతిసారి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 నెలల బకాయిలు లభిస్తాయి. అలాగే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 8వ వేతన సంఘం తన సిఫార్సులను ఖరారు చేయడానికి 15 నుంచి 18 నెలల వరకు సమయం పట్టవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం సమర్పించే వరకు మధ్యంతర నివేదికను కూడా సమర్పించవచ్చు. దీనికి సంబంధించి పూర్తి నివేదిక 2026 చివరికి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గం వచ్చే నెలలో 8వ వేతన సంఘం నిబంధనలను ఆమోదించవచ్చు అని నివేదికల ప్రకారం తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మంత్రివర్గం దానిని ఆమోదించిన వెంటనే అధికారిక ప్రకటన కూడా వెలువడుతుంది. పే కమిషన్ ఆ తర్వాత ఏప్రిల్ 2025 నుండి తన పనిని ప్రారంభిస్తుంది.