Accident: వాహనం బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

Accident
Accident

Accident: కామారెడ్డి/సదాశివనగర్, ఏప్రిల్ 05 (ప్రజా శంఖారావం): ప్రధాన జాతీయ రహదారిపై అధిక లోడుతో వస్తున్న టాటా ఏస్ వాహనం టైర్ పగిలిపోవడంతో వాహనం బోల్తా కొట్టింది. విరాల్లోకి వెళితే స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ సమీపంలో శనివారం ఉదయం రాజమండ్రి నుండి నిజాంబాద్ వైపుగా కొబ్బరి బొండాల లోడుతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం సదాశివనగర్ ప్రధాన రహదారిపై ఒక్కసారిగా టైర్ పగిలిపోవడంతో బోల్తా కొట్టిందని గ్రామస్తులు పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏ ప్రాణ నష్టం జరగలేదు. వాహన పల్టీ కొట్టిన సమయంలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినా జాతీయ రహదారిపై వాహనం బోల్తాపడడంతో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now