Housing Scheme: ప్రతి ఒక్కరు కూడా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలి అనుకుంటారు. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వలన వాళ్ళు వెనకడుగు వేస్తారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి వాళ్లు సొంత ఇంటి గురించి కలలు కంటూ ఉంటారు. అయితే కొంతమందికి ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో మీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది. రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. రాష్ట్రానికి లక్ష ఇల్లు మంజూరు చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఇళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాలలో నిర్మించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇల్లు అందించాలి అనే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీం ద్వారా అర్హులైన ఒప్పో ఇంటికి ఐదు లక్షలు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. అలాగే ఈ ఏడాది జనవరి 26న గ్రామీణ ప్రాంతాల్లో 71,500 ఇళ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు కూడా అందజేశారు.
చాలా చోట్ల ఇప్పటికే ఇండ్ల నిర్మానం కూడా మొదలుపెట్టేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మిస్తున్న ఒక్కొక్కరికి లక్షన్నర అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 72000 అందజేస్తుంది. ఈ లక్ష ఇండ్లకు గాను కేంద్రం నుంచి 1500 కోట్లు రాష్ట్రానికి అందుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో కేంద్రం ఇచ్చే లక్షన్నర తో పాటు మిగిలిన మూడున్నర లక్షల రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే లబ్ధిదారులకు మంచి నాణ్యతతో కూడిన ఇల్లు దొరకనున్నాయి.