Tax Rule Changes: గుడ్ న్యూస్.. రూ.12 లక్షల ఆదాయంపై జీరో పన్ను…ఏప్రిల్ 1 నుండి కొత్త నియమాలు

Tax Rule Changes
Tax Rule Changes

Tax Rule Changes: గతంలో ఉన్న పన్ను విధానంలో 12 లక్షల ఆదాయంపై 80 వేల రూపాయలు పన్నులు విధించేది. తాజాగా పన్ను రేట్లను సవరించడంతో ప్రస్తుతం రూ.60 వేలు. దాంతో 12 లక్షల వరకు పూర్తి రాయితీ కావడంతో నికర పన్ను జీరో. జీతం పొందే వ్యక్తులకు ఈ పరిమితి రూ.12.75 లక్షల వరకు ఉంటుంది. ఏప్రిల్ ఒకటి నుంచి 2025-26 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొత్త ఆదాయపు పన్ను నియమాలు అమలులోకి వచ్చాయి. ఫిబ్రవరి నెలలో జరిగిన కేంద్ర బడ్జెట్ లో దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ కొత్త నియమాలను ప్రకటించారు. అయితే ఈ మార్పులతో కేంద్ర ప్రభుత్వం పన్ను నియమాన్ని సులభం చేయడమే కాకుండా మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

తాజాగా వచ్చిన కొత్త ఆదాయపు పన్ను విధానం వార్షిక ఆదాయం 12 లక్షల వరకు పన్ను రహితంగా ఉండటానికి అనుమతి ఇచ్చింది. పన్ను చెల్లించే వాళ్లకు ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మనదేశంలో రెండు వేరువేరు పన్ను విధానాలు ఉన్నాయి. పాతది మరియు కొత్తది. ఈ రెండు విధాలాలలో కూడా ప్రభుత్వం వివిధ ఆదాయ స్థాయిలకు పన్ను రేట్లను సవరించడం జరిగింది. పాత లేదా సాంప్రదాయ పన్ను విధానంలో పన్ను చెల్లించేవాళ్లు పన్ను చట్టాల కింద అనేక రకాల ఉపశమనాలను పొందవచ్చు. పన్ను విధించదగిన ఆదాయంపై మరిన్ని తగ్గింపులను అనుమతి ఇస్తాయి. పన్ను చెల్లించే వాళ్ళ పన్ను విధించగా ఆదాయాన్ని ఇది సమర్థవంతంగా తగ్గిస్తుంది. తాజాగా సవరించిన కొత్త విధానం మరింత ఆకర్షణీయంగా చేస్తున్నందున ఈ ఏడాది తక్కువమంది పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. 2024 ఆగస్టు నెల నుంచి ప్రభుత్వ నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 72% మంది పన్ను చెల్లించేవాళ్లు కొత్తవిధానాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now