IPL 2025: చూస్తే అందరూ కింగ్ ప్లేయర్లే.. సొంత మైదానంలో ఘోర ఓటముల రికార్డు
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత మైదానంలో తేలిపోతుంది. బయట స్టేడియాల్లో
ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో గెలిచిన ఆర్సీబీ హోం గ్రౌండ్ లో మాత్రం నిరాశపరుస్తోంది. ఓపెనర్లు పిల్ సాల్ట్, విరాట్ కొహ్లీ ఇద్దరు పంజాబ్ తో జరిగిన మ్యాచులో తక్కువ స్కోరు కే అవుట్ కావడంతో ఆర్సీబీ ఓడిపోక తప్పలేదు. మొదటి నుంచి మంచి పామ్ లో ఉన్న పిల్ సాల్ట్ పంజాబ్ మ్యాచులో నాలుగు పరుగులకే అవుటయ్యాడు. విరాట్ ఒక్క పరుగుకే అవుట్ కావడంతో ఆర్సీబీ కేవలం 95 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చిన్నస్వామి స్టేడియంలో లయ తప్పుతున్న ఆర్సీబీ
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సొంత వేదికగా ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచులు ఆడుతున్న సంగతి విదితమే. అలాంటి సొంత స్టేడియంలో ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన మూడు మ్యాచుల్లో కూడా ఓడిపోయింది. దీంతో ఎప్పుడూ ఈ సాలా కప్ నమ్ దే అనే బెంగుళూరు ఫ్యాన్స్ మరింత నిరాశకు లోనవుతున్నారు.
ప్రస్తుత సీజన్లో బెంగళూరు ఏడు మ్యాచులు ఆడి నాలుగు విజయాలను సాధించింది. ఈ గెలుపులన్నీ కూడా బయట వేదికల్లో కావడం విశేషం. ఈ సీజన్ లో పది జట్లలో తొమ్మిది జట్లు సొంత వేదికల్లో గెలవగా.. ఒక్క ఆర్సీబీ మాత్రమే మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయింది.
ఆర్సీబీ 46 మ్యాచుల్లో అలా..
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అన్ని సీజన్లలో కలిపి ఆర్సీబీ మొత్తం 46 మ్యాచుల్లో ఓడిపోయి సొంత మైదానాల్లో ఎక్కువ ఓటములు చెందిన జట్టుగా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తన సొంత గ్రౌండ్ లో 45 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది.
టిమ్ డేవిడ్ కే.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
పంజాబ్ తో మ్యాచులో ఆర్సీబీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే కేవలం టిమ్ డేవిడ్ వల్లే. అప్పటికే 33 రన్స్ కు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు మునిగి ఉన్నప్పుడు టీం డేవిడ్ ఎంట్రీ అయి కేవలం 26 బాలల్లో 50 రన్స్ తీసి పరువు నిలబెట్టాడు. దీంతో ఆర్సీబీ 95 పరుగులు చేయగలిగింది. లేకపోతే ఆర్సీబీ ఘోర పరాభవం ఎదురయ్యేది. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోరు కూడా ఆర్సీబీ పైనే ఉంది. దాని కంటే తక్కువ స్కోరుకే పరిమితమవుతారనే భయం ఫ్యాన్స్ లో ఉండగా.. దేవుడిలా టిమ్ డేవిడ్ ఆదుకున్నాడు. దీంతో ఆర్సీబీ 95 పరుగులతో ఇన్సింగ్స్ పూర్తి చేసుకుంది. చివరకు మ్యాచు ఓడిపోయిన ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.