- జిల్లా కలెక్టర్, ఎస్పీల సహ కారం అభినందనీయం
- డీటీవో శ్రీనివాస్ రెడ్డి
Kamareddy: కామారెడ్డి, ఏప్రిల్ 02 (ప్రజా శంఖారావం): రెవెన్యూ వసూళ్లలో కామారెడ్డి ఆర్టీఏ రాష్ట్రంలోనే ముందంజలో ఉందని డీటీఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతేడాది లక్ష్యం రూ.63 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ.73 కోట్ల లక్ష్యానికి గాను రూ. 68.19కోట్లు (92.4 శాతం) వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల ద్వారా రూ.9.63 కోట్లు, గ్రీన్ టాక్స్ రూ. 79.83 లక్షలు, సర్వీస్ ఛార్జ్ రూ. 2.16 కోట్లు, ఫీజుల ద్వారా 7.35 కోట్లు, లైఫ్ టాక్స్ రూ. 38.34 కోట్లు, త్రైమాసిక టాక్స్ ద్వారా రూ. 9.88 కోట్లు ఆదాయం సమకూరిందని తెలిపారు.
ఇందులో తమ శాఖలోని ప్రతి సిబ్బంది పాత్ర ఉందన్నారు. అలాగే, హెల్మెట్ ధరించక ఏటా సుమారు 240 మంది మృత్యువాత పడుతున్నారని, ఈ సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర సహకారంతో రాష్ట్రంలోని రవాణా శాఖ పన్నుల వసుళ్ళల్లో ముందంజలో నిలిచినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలాగే అన్ని పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు సహకారంతో కమర్షియల్ వాహనాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లించే పనులను కూడా సకాలంలో చెల్లించడంతో ఈ ఘనత సాధించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, ఆర్టీఏ మెంబర్ ఎజాజ్ అహ్మద్, ఏఎంవీఐలు భిక్షపతి, అఫ్రోజ్, సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.