New Rules: ఏప్రిల్ ఒకటి, 2025 నుంచి ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను స్లాబ్ ను అమలు చేసింది. ఈ కొత్త పన్ను విధానాల్లో స్లాబ్ లలో తగ్గింపు మాత్రమే కాకుండా భారీ పనులు మినహాయింపు కూడా ఉండనుందని తెలుస్తుంది. ఉద్యోగం వ్యాపారం లేదా వృత్తి వంటి ఏ పని చేసైనా డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల అనేక మార్పులను తెస్తుందని తెలుసు. కానీ ఈ ఏడాది మాత్రం ఏప్రిల్ నెల ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి ఏప్రిల్ నెలలో జరగబోయే పెద్ద పెద్ద మార్పులు గతంలో ఎన్నడూ జరిగి ఉండకపోవచ్చు. డబ్బు సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది.
నేరుగా ఈ విషయం ప్రజల డబ్బుకు సంబంధించింది. తాజాగా ప్రభుత్వం మధ్యతరగతి మరియు శ్రామిక ప్రజల కోసం అనేక పెద్ద ప్రకటనలను చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా ఏప్రిల్ ఒకటి, 2025 నుంచి అమలులోకి వస్తాయి. దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబ్ మార్కుతో పాటు పన్ను మినహాయింపు కూడా ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
పాత పన్ను విధానంలో ఆర్థిక మంత్రి ఎటువంటి మార్పులను కూడా చేయలేదు. కానీ ఆర్థిక మంత్రి కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్ లను మార్చడంతో పాటు పన్ను మినహాయింపు పరిధిని కూడా పెంచారు. అయితే ఆర్థిక బడ్జెట్లో నిర్దేశించిన ఈ కొత్త ఆదాయపు పన్ను రేట్లు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఒక ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయి. ఈ క్రమంలో సంపాదిస్తున్న ప్రతి వ్యక్తి కూడా తనకు ఎంత పన్ను మినహాయింపు ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నాలుగు లక్షల వరకు ఆదాయం ఉన్న వారిపై జీరో పన్ను. అలాగే నాలుగు లక్షల నుంచి 8 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారిపై ఐదు శాతం పన్ను. 8 నుంచి 12 లక్షల మధ్య ఆదాయం గల వారిపై పది శాతం పన్ను. 12 నుండి 16 సంవత్సరాల ఆదాయంపై 15% పన్ను.