MLA POOJALU: ఎల్లారెడ్డి/తాడ్వాయి, ఏప్రిల్ 6 (ప్రజా శంఖారావం): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని శ్రీశ్రీశ్రీ పరమహంస సచ్చిదానంద సద్గురు శబరిమాత 25వ రజతోత్సవ బ్రాహ్మలీన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ పాల్గొని శబరిమాత దర్శనం చేసుకోన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మ దయ ఉండాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వయంగా అక్కడ భోజనం చేస్తున్న భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు మండల యూత్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భక్తులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now