TELANGANA GOVT: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కనికరించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న బిల్లులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ తమ పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి కి వినతిపత్రాన్ని అందచేశారు. ఈ మేరకు స్పందించిన ఉప ముఖ్యమంత్రి ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల బిల్లులను త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజల పట్ల, ఉద్యోగులు, రైతుల పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా స్పందిస్తుందని ఉపముఖ్యమంత్రి చెప్పినట్లు వారు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే ఉద్యోగులు పరిపాలనలలో కీలకమని, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారికి అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే పెండింగ్ బకాయి బిల్లులపై నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
TELANGANA GOVT: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. బకాయి బిల్లులపై
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now