IPL MATCH 2025: ముంబై ఇండియన్స్ కన్నింగ్ ఫ్లాన్.. సన్ రైజర్స్ ఓడిపోయేందుకు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

IPL MATCH 2025
IPL MATCH 2025

IPL MATCH 2025: ముంబై వాంఖడే పిచ్ ఐపీఎల్ హిస్టరీలోనే నిన్న జరిగిన మ్యాచులో వెరైటీగా స్పందించింది. వాంఖడే పిచ్ ఎప్పుడూ స్పోర్టివ్ పిచ్ గా ఉంటుంది. ఈ వికెట్ పై దాదాపు 200 నుంచి 220 వరకు ఈజీగా రన్స్ చేయొచ్చు. దాన్ని ఛేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాంఖడే లో స్లో వికెట్ రావడం ఏంటీ అని క్రికెట్ ఎక్స్ ఫర్ట్ తో పాటు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ను ఆపాలని..

దీని వెనక ముంబై ఇండియన్స్ పెద్ద ప్లానే వేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ గత మ్యాచులో పంజాబ్ పై 242 పరుగుల స్కోరు ను కూడా 19 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది. పాయింట్స్ టేబుల్స్ లో ముంబై 10, సన్ రైజర్స్ 9 స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు గనక మ్యాచ్ ఓడిపోతే ఇక ప్లే ఆప్స్ దారులు మూసుకుపోతాయి. అందులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. వీరిని అడ్డుకోవాలంటే కచ్చితంగా బౌలింగ్ పిచ్ లోనే సాధ్యమవుతుంది. అందుకే స్లో పిచ్ తయారు చేయించుకున్నారు.

మ్యాచును కాపాడుకునేందుకు ముంబై కన్నింగ్ ప్లాన్..

సొంతగడ్డపై క్యూరెటర్ తో మాట్లాడుకుని మనకు నచ్చిన పిచ్ ను తయారు చేయించుకునే అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ బ్యాటర్ల దాడి నుంచి బౌలర్లను, మ్యాచును కాపాడుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. అన్నీ అనుకున్నట్లుగానే టాస్ కూడా గెలవడం కూడా వారికి కలిసివచ్చింది. సెకండ్ ఇన్సింగ్స్ లో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందని టాస్ సమయంలోనే హర్దిక్ పాండ్యా చెప్పాడు. ఇంకేముంది ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను ముందు కట్టడి చేశారు. వారిద్దరూ క్రీజులో ఉన్నా స్కోరు బోర్డు పరుగులు పెట్టలేదు.

పేస్ ఆప్ చేసి..

స్లో వికెట్ పై ఎలా బౌలింగ్ చేయాలన్న దానిపై ముందుగానే ప్లాన్ వేసుకున్నారు. దానికనుగుణంగా పేస్ ఆప్ చేసి బౌలింగ్ చేశారు. జస్ ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హర్దిక్ పాండ్యాలు ముగ్గురు కలిసి పేస్ ఆప్ చేసి బౌలింగ్ వేసిన బంతులే ఏకంగా 30 వరకు ఉన్నాయి. ఇందులో కేవలం 30 రన్స్ మాత్రమే ఇచ్చారు. అయితే మొదట బౌలింగ్ చేసి కలిసి రావడంతో కచ్చితంగా పేస్ ఆప్ చేసి వేస్తే ఎలా ఆడాలో ముందే తెలుసుకున్నారు. అయినా ఇలా తక్కువ స్పీడ్ తో వేసిన బంతులకు ముగ్గురు ముంబై బ్యాటర్లు అవుటయ్యారు. మొత్తం మీద ఈ మ్యాచులో గెలిస్తేనే టోర్నీలో నిలుస్తామని నిర్ణయించుకున్న ముంబై ఇండియన్స్ యాజమాన్యం పిచ్ క్యూరెటర్ తో స్లో పిచ్ తయారు చేయించుకుని మరీ మ్యాచ్ గెలిచారు. కానీ ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై మండిపడుతున్నారు.

హైదరాబాద్ లో చూసుకుందాం..

ముంబై ఇండియన్స్ కు ధైర్యం లేదు. అందుకే ఇలాంటి పిచ్ రెడీ చేసుకున్నారు. అసలు ఏ రోజైనా పిచ్ ఈ విధంగా స్పందిస్తుందా.. ఐపీఎల్ లో ఇలాంటి స్లో పిచ్ తయారు చేస్తారా అని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు తప్పించుకున్నారు.. ఏప్రిల్ 23న హైదరాబాద్ ఉప్పల్ లో జరిగే మ్యాచులో మాత్రం మీ బౌలింగ్ ను ఉతికి ఆరేయడం కన్ఫమ్ అంటూ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ముంబై ఇండియన్స్ గెలుపు కోసం స్లో పిచ్ ను ఆశ్రయించిందని స్పష్టంగా అర్థమవుతోంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now