Murder Attempt: ఆర్మూర్ టౌన్, ఆగస్టు 20 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ చౌరస్తాలో కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది. పెర్కిట్ చౌరస్తాలో వైన్స్ వద్ద మద్యం సేవిస్తుండగా బండి మహేష్ పై ప్రశాంత్ కత్తితో దాడి చేసినట్లు మహేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు స్నేహితులే అని వారి మధ్య గొడవలు తలెత్తడానికి కారణాలు తెలియవని బాధితుని కుటుంబ సభ్యులు చెప్పారు. తాగిన మైకంలో కత్తితో దాడి చేయగా గాయాలైన క్షతగాత్రుని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఎస్సై గంగాధర్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now