IPL 2025: ఇండియా, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇండియాలో ఐపీఎల్, పాకిస్థాన్ లో పీఎస్ఎల్ ఆడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్ల భద్రత గురించి న్యూజిలాండ్ అధికారులు అప్రమత్తమయ్యారు. తమ క్రికెటర్లకు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు. ఎక్కడ ఉన్నారు. తదితర అంశాలను న్యూజిలాండ్ దేశ భద్రతాధికారులు పరిశీలించారు.
ఐపీఎల్ లో న్యూజిలాండ్ ప్లేయర్లు ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర, డేవాన్ కాన్వే ఆడుతున్నారు. అటు పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ లో కేన్ విలియమ్ సన్, మార్క్ చాప్ మన్, టిమ్ సిఫర్ట్, డెరెల్ మిచెల్, అలెన్ ఫిన్, తదితర ప్లేయర్లు ఆయా జట్ల తరఫున పాల్గొంటున్నారు. అయితే ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా భారత్, పాకిస్థాన్ టెర్రర్ క్యాంపులపై ఆపరేషన్ సింధూర్ అంటూ మంగళవారం తెల్లవారుజామున భీకర దాడి చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్ లోని జైషే మహమ్మద్ టెర్రరిస్టులకు చెందిన వివిధ క్యాంపులు నేలమట్టం చేశారు. ఈ దాడిలో చాలా మంది టెర్రరిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. ఎయిర్ స్ట్రైక్ చేసినట్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, ఎయిర్, నేవీ ఛీప్ ఆఫీసర్లు ఈ విషయాన్ని ప్రకటించారు. కానీ పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదులపై కాకుండా అమాయక ప్రజలపై దాడులకు తెగబడ్డారని కావాలనే ఆరోపణలు చేస్తోంది. భారత్ మొత్తం 9 ప్రాంతాల్లో తొమ్మిది ప్లేస్ లలో ఒకే సారి ఎటాక్ కు దిగింది. దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహల్ పూర్ టెర్రర్ క్యాంప్ పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో అనేక మంది ఉగ్రవాదులు మరిణించినట్లు తెలుస్తోంది.