PM Modi AC Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఇప్పటికే పీఎం మోడీ ఏసీ యోజన స్కీమ్ అమలులోకి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పథకాన్ని బీఎస్ఈఎస్ అమలు చేస్తుంది. ప్రతి ఏడాది కూడా ఎండ తీవ్రత వలన వేడి స్థాయి పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రతి ఏడాది ఏసీ అమ్మకాలు కూడా బాగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక మీడియా నివేదిక ప్రకారం 2021-22లో 84 లక్షల ఏసీలు అమ్ముడు అయ్యాయని అలాగే 2023-24 నాటికి 1.1 కోట్లకు ఏసి అమ్మకాలు పెరిగాయని వెల్లడించింది. శీతలీకరణ బాగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా పవర్ గ్రిడ్ మరియు విద్యుత్ వినియోగంపై ఒత్తిడి ప్రతి ఏడాది పెరుగుతుంది.
ఈ సవాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ ఏసి యోజన పథకాన్ని ప్రజల కోసం అమలులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పెరుగుతున్న విద్యుత్ వినియోగం సమస్యను పరిష్కరించడానికి త్వరలో ఒక కొత్త పథకాన్ని తీసుకొని రాబోతుందని సమాచారం. ఈ పథకం కింద ఎక్కువ విద్యుత్తును వినియోగించే ఏసీలను ప్రజల ఇళ్ల నుంచి తొలగించి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ మోడల్లను కొనుగోలు చేసేలా చేస్తుంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రతి ఏడాది పెరుగుతున్న విద్యుత్ వినియోగ సమస్యను నియంత్రించడం.
ఈ క్రమంలో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అలాగే విద్యుత్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. ఇది ప్రజలకు కూడా చాలా ప్రయోజనాకరంగా ఉంటుంది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడం వలన ప్రజల డబ్బు కూడా ఆదామవుతుంది. విద్యుత్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మంత్రిత్వ శాఖ పిఎం మోడీ ఏసి యోజన విద్యుత్ పథకాన్ని రెడీ చేస్తుంది.
ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలు తమ ఇంట్లో ఉన్న పాత ఏసీలను తీసేసి వాటి స్థానంలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న మోడల్లను కొనుగోలు చేయాలి. వీటి వలన ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారు. ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నది తక్కువ విద్యుత్తును వినియోగించడం వలన కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. ఈ క్రమంలో విద్యుత్ గ్రిడ్ పై కూడా ఒత్తిడి తగ్గుతుంది.