Poisoning: ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం.. ఆలస్యంగా వెలుగు చూసినా ఘటన

Poisoning
Poisoning

Poisoning: ఇచ్చోడ, ఏప్రిల్ 16 (ప్రజా శంఖారావం): అభం శుభం తెలియని పిల్లలపై విష ప్రయోగం చేయడానికి ఎవరు సాహసం చేశారు. అసలు ఎందుకు విష ప్రయోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. పురుగుల మందు డబ్బా పాఠశాల ఆవరణలో పడి ఉండడంతో అప్రమత్తమైన పాఠశాల ప్రధానోపాధ్యారాలు. వివరాల్లోకి వెళితే.. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

వంట గదిలో పురుగుల మందు వాసన రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాఠశాల ఆవరణలో పడి ఉన్న పురుగుల మందు డబ్బాను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది తాగు నీటి వైపు పిల్లలను వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. మధ్యాహ్న భోజన సమయంలో ఉపయోగించే వంట పాత్రలపై పురుగుల మందు పోసినట్లు ఆనవాళ్లను గుర్తించారు.

పిల్లలు తాగే మంచినీటి ట్యాంకులో విషయ ప్రయోగం జరిగినట్లుగా గుర్తించారు. వెంటనే తేరుకున్న పాఠశాల సిబ్బందితోపాటు గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసి విష ప్రయోగం జరగడానికి గల కారణాలను అన్వేషించాలని, ఆ కోణంలో దర్యాప్తు చేయాలని కోరారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now