Police Riding:పేకాట స్థావరం పై దాడి నలుగురు అరెస్ట్

TaskForce Police Attack
TaskForce Police Attack

Police Riding: నిజామాబాద్ జిల్లా, ఆగస్టు 15 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ ఏసీపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ పురుషోత్తం సిబ్బందితో కలిసి గురువారం ఇందల్వాయి మండలం తిర్మన్ పల్లి శివారులో పేకాట స్థావరం పై దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి నాలుగు సెల్ ఫోన్లు, ₹ 18,400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కు అప్పజెప్పినట్లు చెప్పారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది లక్ష్మన్న, రాజేశ్వర్, సుదర్శన్, అనిల్ కుమార్, నరసయ్య, ఆజములు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now