Pregnant delivery: మార్గమధ్యంలోనే గర్భిణీ ప్రసవం

Woman giving birth
Woman giving birth

Pregnant delivery: కామారెడ్డి జిల్లా/బిచ్కుంద, ఆగస్టు 24 (ప్రజా శంఖారావం): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం తక్కడపల్లి గ్రామానికి చెందిన గర్భిణి అశ్విని పురిటి నొప్పులు రావడంతో బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ లో కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో పురిటి నొప్పులు ఎక్కువవడంతో అంబులెన్స్ లోనే అశ్విని ప్రసవించింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు. అనంతరం వారిద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అనిల్, అంబులెన్స్ డ్రైవర్ కాశీనాథ్, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు, కుటుంబ సభ్యులు ఉన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now