Telangana: ఏళ్ల నాటికల సాకారం.. ఆర్మూరు-జగిత్యాల హైవే నిర్మాణా పనులకు గ్రీన్ సిగ్నల్

Telangana
Telangana

Telangana: తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల హైవే నిర్మాణానికి పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది. చాలా కాలం నుంచి ఉన్న ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుంది. దీనికి సంబంధించి త్వరలో టెండర్లు ఆహ్వానించి మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎన్ హెచ్ 63 నీ నాలుగు లైన్లుగా విస్తరించి, పట్టణాలు మరియు గ్రామాల దగ్గర బైపాస్ నిర్మించబోతున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి అవడానికి రూ.3,850 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్న కలలు త్వరలో నెరవేరబోతున్నాయి. ఏళ్ల తరబడి ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల ప్రాంతానికి చెందిన ప్రజలు ఎదురుచూస్తున్న హైవేకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.

తాజాగా ఈ రోడ్డు నిర్మాణానికి వీలుగా ఉండే విధంగా అటవీ మరియు పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. దాంతో త్వరలో టెండర్లు పిలిచి నిర్మాణ పనులను చేపడతారు. మరో మూడు ఏళ్లలో ఈ హైవే పూర్తవుతుందని తెలుస్తుంది. ఎన్ హెచ్ 63 ప్రస్తుతం రెండు వరుసలుగా ఉంది. ఈ దారిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో దీనిని నాలుగు లైన్లుగా నిర్మించాలంటే చాలామంది ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. కానీ కొన్ని కారణాల వలన అది జరగలేదు. తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పని జరగనుంది.

దేశంలో ఉన్న కీలక జాతీయ రహదారులలో ఈ రహదారి కూడా ఒకటి. ఎన్ హెచ్ 63 రహదారి మహారాష్ట్రలో దౌండ్ దగ్గర మొదలయ్యి తెలంగాణ రాష్ట్రం, చతిస్గడ్ రాష్ట్రం మీదుగా 1065 కిలోమీటర్లు కొనసాగి ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపూట్ లో ముగుస్తుంది. ఈ రహదారి తెలంగాణ రాష్ట్రంలో బోధన్, నిజామాబాద్, ఆర్మూరు, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూరు ప్రాంతాలమీదుగా ఈ రహదారి ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now