Ration Cards: తాజాగా రేషన్ కార్డు ఉన్నవాళ్లకు ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేసింది. వెంటనే రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఇలా చేయకపోతే అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మీకు వచ్చే రేషన్ కూడా పూర్తిగా బంద్ అవుతుంది. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఎంత అవసరమో అందరికీ తెలుసు. రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వము అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఆ కుటుంబాలకు లభిస్తాయి. పెన్షన్ పొందాలన్నా, ఇంటి పట్టాలు కావాలన్నా మరి ఇతర పథకాలు ప్రయోజనాలు పొందాలన్నా కూడా రేషన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. లేకపోతే వీళ్ళు చాలా ప్రయోజనాలు మిస్ అయిపోతారు. రేషన్ కార్డు ఉన్నవాళ్లకు కుటుంబంలో ప్రతి మనిషికి ఐదు కేజీల బియ్యం ఉచితంగా లభిస్తుంది. కుటుంబంలో నలుగురు ఉంటే వాళ్లకు 20 కేజీల బియ్యం వస్తాయి. బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు కూడా ప్రభుత్వం అందిస్తుంది.
వీటిని సబ్సిడీ కింద తక్కువ డబ్బులకే ఇస్తారు. ఇలా రేషన్ కార్డు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. రేషన్ కార్డు ఉన్నవాళ్లు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి. వీళ్లకు కేవలం రెండు వారాలు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులోపు పూర్తి చేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాలి. రేషన్ కార్డులో పేరు ఉన్నవారు కచ్చితంగా గడువు ముగిసే లోపల ఈ కేవైసీని పూర్తి చేయాలి. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈనెల చివరి వరకు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే చాలామంది ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేశారు. వాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పటి లాగానే వాళ్లకు రేషన్ సరుకులు అన్ని వస్తాయి.
ఒకవేళ మీరు గడువు లోపల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే రేషన్ కార్డు నుంచి మీ పేరు తొలగించే అవకాశం ఉంటుంది. ఈనెల చివరిలోపు ఈ కేవైసీ ప్రక్రియ చేయించుకోకపోతే రేషన్ కార్డులో మీ పేరు తీసేస్తారు. ఆ తర్వాత మీకు ప్రభుత్వం అందించే బియ్యం కానీ ఇతర సరుకులు కానీ రావు. అలాగే ప్రభుత్వం అందించే పథకాలు కూడా మీకు వర్తించవు.